ఆసియా రెజ్లింగ్ లో స్వర్ణం సాధించిన భారత రెజ్లర్
Published on: Sun Apr 21, 2013 7:55AM
.png)
న్యూడిల్లీ లోని కె.డి. జాదవ్ స్టేడియంలో జరిగిన 55 కిలోల విభాగంలో ఫైనల్ లో లండన్ ఒలింపియన్ భారత రెజ్లర్ అమిత్ కుమార్ ఉత్తర కొరియా రెజ్లర్ క్యోంగ్ యాంగ్ పై 1-0, 5-2 పాయింట్ల తేడాతో గెలిచి స్వర్ణం సాధించాడు. తలకి గాయమైనా లెక్కచేయకుండా ఈ ఈవెంట్ లో పాల్గొని భారత్ కు స్వర్ణం సాధించిపెట్టాడు. గతేడాది జరిగిన పోతెలలో కాంస్యంతో సరిపెట్టుకున్న అమిత్ కుమార్ ఈ సారి స్వర్ణం సాధించాడు. స్వర్ణం సాధించడంతో తొలిసారిగా ఆసియా చాంపియన్ గా నిలిచాడు.


