కన్నా వ్యవసాయ బడ్జెట్

 

రాష్ట్ర శాసనసభలో నేడు వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మినారాయణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కన్నా వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రైతుల సమగ్ర అభివృద్దే లక్షంగా ప్రత్యేక బడ్జెట్ తెస్తున్నట్టు, ప్రత్యేక బడ్జెట్ తెచ్చినంత మాత్రాన వ్యవసాయమ్లోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తాము భావించడం లేదని, ఈ ప్రత్యేక బడ్జెట్ వల్ల వ్యవసాయ రంగంపై శ్రద్ధ పెరుగుతుందని, రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా వినియోగమయ్యేలా చూసేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.