ఆక్వా ఫుడ్ పార్క్ కు మళ్లీ కష్టాలు... 5గురు మృతి..


పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విషాదం నెలకొంది. విషవాయువులు వెలువడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం... మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో రసాయనిక ట్యాంకును శుభ్రం చేస్తుండగా.. విషవాయువులు వెలువడి ఐదుగురు కార్మికులు మరణించారు. మృతులను ఈగ ఏడుకొండలు, జక్కంశెట్టి ప్రవీణ్, నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, తోట శ్రీనుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. మరి ఇప్పటికే ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై ఆందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకోవడంతో దీని ఏర్పాటుకు మరింత సమస్య వచ్చినట్టైంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.