వీలునామా రాసేస్తానంటున్న విజయశాంతి

 

 

 

మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి విజయశాంతి తన వీలునామా రాసే యోచనలో వున్నారు. ఈ వయసులో వీలునామా రాయడమేంటన్న డౌటు కొంతమందికి రావొచ్చు. అయినా ఏ నిమిషానికి ఏమి జరుగునో అని సరిపెట్టుకోనూ వచ్చు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, కేసీఆర్, హరీష్ రావుతోపాటు విజయశాంతి ఆస్తుల మీద దర్యాప్తు చేయాలని సీబీఐ కోర్టు నిన్న ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజయశాంతి ఒక నిర్ణయం తీసుకున్నారు. తన పేరిట ఉన్న ఆస్తులన్ని తన మరణం తర్వాత మెదక్ వాసులకు ఇచ్చేస్తానని విజయశాంతి ప్రకటించారు. రామాయంపేటలో విజయశాంతి ఎన్నిక ప్రచారాన్ని నిర్వహిస్తున్న విజయశాంతి మాట్లాడుతూ, సీబీఐ దర్యాప్తును తాను స్వాగతిస్తున్నానని, రాజకీయాల్లోకి వచ్చి తాను వెనకేసుకుంది ఏమీ లేదని చెప్పారు. తనపేరిట ఉన్న ఆస్తులన్నిటినీ భవిష్యత్తులో మెదక్ జిల్లావారికి రాసిచ్చేస్తానని అన్నారు.