అఖిలేష్ యాదవ్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు.

 

మహారాష్ట్రలోని లాతూర్ కి  నీటి రైలును పంపించినట్టే.. యూపీలోని బుందేల్ ఖండ్ కు కూడా కేంద్రం నీటి రైలును పంపించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం మాత్రం నీటి రైలును అడ్డుకొని.. తమకు నీటి రైలు ఏం అవసరం లేదని.. దీనిపై ప్రధాని మోడీతో మాట్లాడతామని చెప్పిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పందించి ఈ రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తే చేశారు. అఖిలేష్ యాదవ్ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని.. యూపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని.. ప్రజలు నీళ్లు లేక అల్లల్లాడిపోతుంటే.. నీళ్లు, ఆహారం విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu