హైకోర్టు ఆగ్రహం... 11 మంది జడ్జిలు సస్పెండ్..

 

హైకోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు 11 మంది జడ్జిలను సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారంటూ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో జడ్జిల సస్పెన్సన్ పై లాయర్లు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయమని ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి ఎందుకు లెట‌ర్ రాయడం లేద‌ని న్యాయ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ప్రోత్సాహంతోనే తెలంగాణ న్యాయాధికారుల‌ను తొల‌గిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.