ప్రత్యేక తెలంగాణ పై రాహుల్ కి కిరణ్ వివరణ
posted on Feb 15, 2013 4:20PM
విబేధాలు విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహాల్ గాంధీ నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయపథంలో నడిపించే దిశగా పనిచేయాలని వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ అంశంపై రాహుల్కు సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ బొత్స సత్యనారాయణ వివరించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం జరిపిన తొలి రోజు సమావేశం ముగిసింది. 2014లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ ఈ రెండు రోజులు వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు తీసుకోవల్సిన చర్యలపై నేతలతో చర్చించి, పలు సూచనలు చేశారు. రేపు కూడా సమావేశం జరగనుంది.