హత్య కేసులో లొంగిపోయిన టిడిపి ఎమ్మెల్యే

 

 TDP MLA Erra Shekhar surrenders,  TDP MLA surrenders

 

 

తన సోదరుడు జగన్మోహన్ ను హత్య చేసిన కేసులో హైకోర్టు బెయిలు పిటీషన్ ను తిరస్కరించడంతో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆలియాస్ ఎర్ర చంద్రశేఖర్ మహబూబ్ నగర్ ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. జులై 17న సోదరున్ని హత్య చేసిన అనంతరం ఎర్ర శేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఇప్పటి వరకు పోలీసులకు పట్టుబడలేదు. పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పలుమార్లు బెయిలు పిటీషన్లు కోర్టులు కొట్టేయడంతో ఎట్టకేలకు తానే లొగింపోయారు.


ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ సర్పంచ్ పదవికి తన భార్యను పోటీకి దింపాడు. ఎర్రశేఖర్ భార్య కూడా సర్పంచ్ గా పోటీచేస్తుంది. అయితే నామినేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పినా సోదరుడు వినకపోవడంతో కాల్చిచంపారు. ఆ ఘటనకు పాల్పడింది ఎర్రశేఖర్ అని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఆధారాలున్నాయని పోలీసులు కూడా తెలిపారు.