ఓయూ క్యాంపస్ టెన్షన్, పోలీసుల పై రాళ్ళ వర్షం

 

 

 osmania Tense, telangana issue, Pro-Telangana leaders arrested in Hyderabad for defying police ban

 

 

సమర దీక్షకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఓయు గేటు వద్ద, విద్యానగర్ చౌరస్తా వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఉస్మానియా క్యాంపస్ చుట్టూ పోలీసులను మోహరించారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా పోలీసులు చూస్తున్నారు. విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు తమను అడ్డుకోవడంతో వారిపై రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఓయు మరోసారి ఉద్రిక్తంగా మారింది.