రెండు రాష్ట్రాలకు నరసింహనే గవర్నర్!

 

 Narasimhan could be appointed as Governor for both, Narasimhan, telangana, samaikyandhra, congress, sonia gandhi

 

 

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ను నియమించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయ, సామాజిక అంశాల మీద గవర్నర్ కు మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుండి రెండు రాష్ట్రాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తారని అంటున్నారు. కేంద్రం పిలుపు మేరకు ఆయన ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు చిదంబరం,షిండే తదితరులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే చిదంబరాన్ని కలిసి రాష్ట్ర పరిస్థితులపై , ముఖ్యంగా హైదరాబాద్ అంశంపై ఆయన ఒక నివేదిక ఇవ్వవచ్చని భావిస్తున్నారు.