ఒకే వేదికపై మోడీ,మన్మోహన్‌

 

 

 

భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం ఒకే వేదికపై కలుసుకునున్నారు. అహ్మదాబాద్‌లో వీరిద్దరూ కలిసి సర్దార్‌ పటేల్‌ మ్యూజియంను ప్రారంభించారు. మోడీ భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక వీళ్లిద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. మన్మోహన్ పై మోడీ వరుసగా వాగ్బాణాలు సంధించడం, మోడీ సభలో పేలుళ్లపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటం.. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మామలుగా మన్మోహన్ పై విరుచుకుపడే మోడి మంగళవారం మాత్రం ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి ఆయనతో కరచాలనం చేశారు. మన్మోహన్ కూడా నవ్వుతో ఆయన్ని పలకరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu