కిరణ్‌బేడికి బీజేపీ గిఫ్ట్..పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడి

మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్‌బేడికి బీజేపీ గిఫ్ట్ ఇచ్చింది. ఆమెను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడి పుదుచ్చేరికి 24వ లెఫ్టినెంట్ గవర్నర్. 1971 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అయిన బేడి దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్. 35 ఏళ్లపాటు ఆమె సేవలందించి అనంతరం సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనంతరం 2015లో బీజేపీలో చేరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగి ఘోర పరాజయం పొందారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదని ప్రకటించారు. అయితే ప్రజా సేవ మాత్రం చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది