కాంగ్రెస్ కి కావూరి రాజీనామా

 

 

 

కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి మంత్రి పదవికి తన రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరతారని తెలిసింది. ఈ మేరకు ఆయన ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. మధ్యాహ్నం 12గంటలకు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.