మీడియా మీద మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనా

 

సినిమా అప్డేట్స్ కంటే వివాదలతోనే వార్తలలో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ఆమెకు బాలీవుడ్ మీడియాకి మధ్య ఏర్పడిన  వివాదం ముదురుతోంది. ఈ నెల 7వ తేదీన తన తాజా చిత్రం 'మెంటల్ హై క్యా' చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో కంగన మాట్లాడుతూ, 'మణికర్ణిక' చిత్రం గురించి నీచంగా రాశారంటూ ఓ జర్నలిస్టును దుర్భాషలాడింది. ఈ నేపధ్యంలో సదరు జర్నలిస్ట్ కి కంగన బహింరంగ క్షమాపణ చెప్పాలని అలా ఆమె చెప్పేవరకూ ఆమెకు మీడియా కవరేజ్ ఇవ్వబోమని 'ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో 'మెంటల్ హై క్యా' చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పింది కానీ కంగనా మాత్రం చెప్పలేదు. అంతేకాదు, మీడియాను దుర్భాషలాడుతూ మరో వీడియోను విడుదల చేసింది. 'ఫ్రీగా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు. మిమ్మల్ని జర్నలిస్టులని ఏ ఆధారంతో పిలవాలి? నన్ను బ్యాన్ చేయమని చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే, నా పేరు చెప్పుకుని మీరు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. మీలాంటి సూడో జర్నలిస్టులు నా స్టేటస్ ను దెబ్బతీయగలరా?' అని వీడియోలో కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక మీడియాని దేశద్రోహి, అమ్ముడుపోయే, విలువలేని, పదో క్లాస్ కూడా పాస్ కాలేని వాళ్ళు మీడియాలో ఉన్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.