నేను బతకాలి.. ఇంకెవరూ బతకకూడదు

 

జేసీ దివాకర్ రెడ్డి ..ఈ పేరు వింటేనే గుర్తొచ్చేది సంచలనాత్మక వ్యాఖ్యలు.మరో మారు జేసీ తెలంగాణ సీఎం కేసీఆర్‌, మోదీపై సంచలనాత్మక విమర్శలు చేశారు.పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన జేసీ ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి భాష వాడటం మంచి కాదన్నారు.చంద్రబాబు ఎలా మాట్లాడుతారో చూడాలని సూచించారు. చంద్రబాబుకు, కేసీఆర్‌కు చాలా తేడా ఉందని అన్నారు. కేసీఆర్‌ భస్మాసురుడులాంటి వాడని, భస్మాసురుడు ఎలాగైతే తన చేత్తో తానే భస్మమయ్యాడో ఆయన కూడా తన మూడో కంటితో తానే బూడిదవుతాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులకు ఎవరూ భయపడటం లేదని జేసీ అన్నారు.మోదీ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తానెప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు.‘నేను బతకాలి.. ఇంకెవరూ బతకకూడదు’ అనేది ప్రధాని మోదీ భావజాలమని, తనతో పాటు పది మంది బతకాలనే మనస్తత్వం సీఎం చంద్రబాబుదని జేసీ వ్యాఖ్యానించారు.