క్రికెట్ బెట్టింగ్ పై దావూద్ జోస్యం..

 

టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా నిన్న వెస్టిండీస్ కు భారత్ కు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గురించి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జోస్యం చెప్పారంట. దావూద్ కి ఈ మ్యాచ్ కి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. దావూద్ ఇబ్రహీం క్రికెట్ మ్యాచ్‌ల పైన బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు అది తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే నిన్న జరిగిన మ్యాచ్ పైన కూడా ఆయన బెట్టింగులకు పాల్పడ్డాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బాగా ఆడతాడని.. విరాట్ కంటే ఎక్కువ ఆడతాడని..  సెమీ ఫైనల్లో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ చెలరేగి ఆడినా విజయం మాత్రం ధోనీ సేనదేనని జోస్యం చెప్పాడు. కానీ దావూద్ చెప్పిన జోస్యం మాత్రం ఫలించలేదు. వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిపోవడమే కాకుండా రోహిత్ కూడా విరాట్ కంటే మెరుగ్గా ఆడలేకపోయాడు. మొత్తానికి బెట్టింగ్ రాజా ఆయిన దావూద్ కే ఇండియా టీమ్ షాకిచ్చింది.