వైఎస్ దృతరాష్ట్రుడు

 

 

 

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ దృతరాష్ట్రుడు... మహాభారతంలో దృతరాష్ట్రుడిలాగే వైఎస్ కూడా తన కుమారుడితో అక్రమాలు చేయించాడు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వారి దోపిడీతో పేదలకు దక్కాల్సిన నిధులు మాయమయ్యాయి. అయితే అన్యాయం ఎంతో కాలం సాగదు. వైఎస్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలమీద మా పార్టీ పోరాటం చేస్తుంది. చివరికి ధర్మం గెలుస్తుంది. ఈ ధర్మపోరాటానికి తెలుగుదేశం పార్టీకి ప్రజలు సహకరించాలి” అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేవీపీ రాంచంద్రరావును విచారిస్తే వైఎస్ అక్రమాలన్ని బయటకు వస్తాయని, రాజకీయాలకు వైఎస్ కుటుంబం చెడ్డ పేరు తెచ్చిందని అన్నారు. మతం ముసుగులో వైఎస్ అల్లుడు, కల్తీ ఎరువులతో వైఎస్ బావమరిది, అక్రమ ఆస్తులతో వైఎస్ జగన్ రాజకీయాల బ్రష్టుపట్టించారని అన్నారు.