12 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

 

 

 

లోక్‌సభలో 12 మంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అరంగట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్ మీరాకుమార్ సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధన 374ఏ ప్రకారం స్పీకర్ మీరాకుమార్ ఎనిమిది మంది కాంగ్రెస్, నలుగురు టీడీపీ సీమాంధ్ర ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


సప్పెన్షన్ గురైన టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. సస్పెన్షన్ జాబితాలో సాయిప్రతాప్, అనంత, లగడపాటి, మాగుంట, హర్షకుమార్, మోదుగుల, ఉండవల్లి, కొనకళ్ల, శివప్రసాద్, నిమ్మల కిష్టప్పతో పాటు సబ్బంహరి, కనుమూరి బాపిరాజు పేర్లను చేర్చారు. నిన్న లిస్టులో ఉన్న రాయపాటి పేరును తొలగించారు. సమైక్యాంధ్ర కోసం గత కొద్దిరోజులుగా సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో నిరసనకు దిగిన విషయం తెలిసిందే.