టీవీ స్టార్స్ పెళ్లి.. పోలీస్ కేస్!
on May 9, 2021
బాలీవుడ్ టెలివిజన్ రంగంలో పాపులర్ నటీనటులు సుగంధ మిశ్రా, సంకేత్ భోస్లే ఇటీవలే ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా వారిద్దరూ ఏప్రిల్ 26న సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరిపై పంజాబ్ ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి పంజాబ్ ప్రభుత్వం విధించిన నిబంధనలను పట్టించుకోకుండా సుంగంధ, సంకేత్ వివాహమా చేసుకున్నారు.
దీంతో రూల్స్ అతిక్రమించినందుకు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాకుండా పెళ్లి జరిగిన రిసార్ట్ ఓనర్లుపై కూడా కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించారనే ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాలను అతిక్రమించారని మరికొన్ని కేసులు నమోదు చేశారు.
అయితే ఈ కేసుకి సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లిలో ప్రభుత్వం విధించిన రూల్స్ కి వ్యతిరేకంగా ఎక్కువమంది పాల్గొన్నారని అధికారులు చెబుతున్నారు.
Also Read