ENGLISH | TELUGU  
Home  » TV News

Brahmamudi: రుద్రాణి తిన్న ప్లాస్టిక్ పండు.. ఒక్కో చెంపదెబ్బకి వంద అంటూ సీమంతం శ్రీను!

on Jan 16, 2025

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-619 లో.. ఇక రుద్రాణి ఎప్పుడైతే నగలు తేవడానికి రాజ్‌ని పంపించు అందో వెంటనే రాజ్ కంగారుపడతాడు. ఈ మాత్రానికి ఆయన్ని అంతదూరం పంపించడం దేనికీ.. ఏం ఫర్వాలేదు.. నేను బాగానే ఉన్నానని కవర్ చేసి ముందుకు నడుస్తుంది కావ్య. ఇక దాంతో ఆ రచ్చ అక్కడితో ఆగుతుంది. ఇక కనకం, సీమంతం శ్రీనుతో మంతనాలు జరుపుతుంటే.. కృష్ణమూర్తి వచ్చి వాళ్లతో మాట్లాడుతుంటారు. కాసేపటికి దుగ్గిరాల వారు నడుచుకుంటూ అక్కడికి వస్తారు. ఇక రుద్రాణి, రాహుల్ ఇద్దరూ కలసి కనకం చేసిన ఏర్పాట్లను ఛీప్‌గా మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటారు. ఆ మాటలకు తన సీమంతం అంత ఛీప్‌గా జరుగుతున్నందుకు స్వప్న ఏడుపు ముఖం పెట్టుకునే ఉంటుంది. చాలా బాధపడుతుంది. ఇక రుద్రాణి, రాహుల్‌లకు ఎప్పటిలానే మిగిలిన వాళ్లంతా గడ్డి పెడతారు. హూ.. ఇక్కడ సీమంతం చేస్తానన్నప్పుడే నా ఆశలు సగం చచ్చిపోయాయి.. ఇక్కడకి వచ్చాక పూర్తిగా చచ్చిపోయాయి. నాకు అసలు నచ్చలేదు.. ఏంటమ్మా ఇలా చేశావ్.. ఛీ అని ఆవేశంగా స్వప్న బాధగా బయటికి వెళ్లిపోతుంది. వెనుకే కావ్య పరుగుతీస్తుంది. నా పెద్దకూతురిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా.. అది అంతా.. ముందు గొడవ చేస్తుంది.. తర్వాత అర్థం చేసుకుంటుంది.. రండి కూర్చోండి.. లోపలికి రండి అంటూ కనకం అందరిని ఆహ్వానిస్తుంది. రండి అని కృష్ణమూర్తి కూడా పిలవడంతో అంతా లోపలికి నడుస్తారు.

ఇక స్వప్న ఏడుస్తుంటే కావ్య వెనుకే వచ్చి.. అక్కా ఏంటిది చిన్న పిల్లలా అందరి ముందు అలా అలిగి వచ్చావేంటని అంటుంది. ఈ ఇంట్లో అలగడానికి కూడా లేదా? అంతా నా కర్మ అని స్వప్న అంటుంది. లేదు ఇది నీ అదృష్టం.. ఆస్తులుంటే అంగరంగ వైభవంగా సూపర్‌గా చేయగలం.. అంతేగా.. రిటర్న్ గిఫ్ట్ కోసం వచ్చే బంధువులు కాదు కదా మనకు కావాల్సింది.. అక్కడికి వచ్చేవాళ్లంతా మన దగ్గరున్న డబ్బుని చూసి వస్తారు. మనం ఎంత గ్రాంఢ్ గా చేసినా ఏదొక వంక పెట్టడానికి ఎదురుచూస్తారంటూ స్వప్నను ఆలోచింపచేస్తుంది కావ్య. అదే ఇక్కడనుకో నాన్న తాటకులతో పందిరి వేసినా.. మామిడి ఆకులతో తోరణాలు కట్టినా అది మన సంసృతిని సంప్రదాయాన్ని తెలియచేస్తుంది. మన దగ్గరకు వచ్చేవాళ్లు మన డబ్బుని చూసి రాకూడదు.. మనం పంచే అభిమానాన్ని ప్రేమల్ని అందుకోవడానికి అంతే అభిమానంగా రావాలి.. అది ఇక్కడ కావాల్సినంత దొరుకుతుంది. నేను చెబుతున్నాను కదా.. ఇక్కడ జరిగే సీమంతం చూసి నీ కడుపు నిండిపోతుంది చూస్తూ ఉండు.. అసలు నువ్వు ఒక విషయం మరిచిపోతున్నావ్ అక్కా.. మనం ఇక్కడే పుట్టి పెరిగామని స్వప్న చేతులు పట్టుకుంటూ కావ్య చెప్తుంటే స్వప్న వింటుంది. కావ్య మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క గడప మనకు తెలుసు.. ప్రతి గడపకు మనమేంటో తెలుసు.. వచ్చేవాళ్లంతా నిన్ను చూసి ఆప్యాయంగా పలకరిస్తుంటే నీకు సంతోషంగా ఉండదా? మనం ఇదే ఇంట్లో ఎన్ని ఆటలు ఆడుకున్నాం అక్కా ఒక్కటి కూడా గుర్తులేదా’ అంటూ ప్రేమగా అడుగుతుంది కావ్య. దాంతో స్వప్న ముఖంలో నవ్వు వస్తుంది. ఎందుకు లేదు.. నాకు చాలా గుర్తున్నాయంటూ ప్రతి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటుంది. మనం చిన్నప్పుడు అలా చేశాం.. ఇలా చేశామంటూ జరిగిందంతా గుర్తు చేసుకుని స్వప్న నవ్వుతూ చెప్తుంది.

సారీ కావ్యా నేను ఇదంతా ఆలోచించలేదు.. అమ్మ బాధపడి ఉంటుంది కదా.. సరే నేను చాలా సంతోషంగా ఈ సీమంతం చేసుకుంటానని స్వప్న అంటుంది. థాంక్స్ అక్కా అని ప్రేమగా చూసి కావ్య వెళ్లిపోతుంది. ఇక రుద్రాణీ, ధాన్యలక్ష్మి కలసి అటుఇటు తిరుగుతూ.. మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా ఇంట్లో ఖర్చుల పేరుతో నాలుగు రకాల టిఫిన్స్ దొరకడం లేదు. కనీసం ఇక్కడైనా తిందామంటే మన వియ్యపురాలు కనకం ఉప్మా పెట్టింది.. ఛ అంటూ విసుగ్గా చెబుతుంటుంది. ధాన్యలక్ష్మి కూడా అవునన్నట్లు తలాడిస్తుంది. ఇంతలో రుద్రాణీకి సీమంతానికి పెట్టిన పండ్లు కనిపిస్తాయి. వెంటనే హమ్మయ్యా కనీసం పండు అయినా తినొచ్చని ఆ పండ్లలో ఒకదాన్ని అందుకోబోతుంది. అది చూసిన సీమంతం శ్రీను.. మేడమ్ అవి మీరు తినకూడదని అంటాడు. నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి అంటూ రుద్రాణి మళ్లీ పండు అందుకోబోతుంటే.. ఆపడానికి చేయి పట్టుకుంటాడు సీమంతం శ్రీను. నా చెయ్యి పట్టుకుంటావారా అని అతడిని లాగిపెట్టి కొట్టేస్తుంది రుద్రాణి. ఇక శ్రీను నోరెళ్లబెట్టి... దవడ మీద చేయి పట్టుకుని.. నన్నే కొడతావా అనేలోపు.. కనకం ఎంట్రీ ఇచ్చి.. శ్రీను మరో చేతిలో సైలెంట్‌గా వంద రూపాలు పెట్టేస్తుంది. దాంతో ఆవేశాన్ని తగ్గించుకుంటాడు శ్రీను. ఇక అవి తినొద్దు వదినగారు అని మర్యాదగా కనకం కూడా చెప్పినా వినకుండా.. నేను తింటానని కొరికి బిత్తరపోతుంది రుద్రాణి. ఇవి ప్లాస్టిక్ పండ్లు కదా.. వీటిని పెట్టారేంటీ.. ఇలా మాయ చేస్తున్నారా అది ఇది అంటూ రుద్రాణి రచ్చ చేయబోతుంటే.. అబ్బే ఇవి సీమంతం కోసం పెట్టిన పండ్లు కాదు.. అలంకరణ కోసం పెట్టాం అంతే అంటూ కవర్ చేసి రుద్రాణీని కనకం కూల్ చేసి పంపిస్తుంది. ధాన్యలక్ష్మి కూడా వెళ్లిపోతుంది. అయితే చెంప దెబ్బకు వంద.. ఫర్వాలేదు.. ఓ నాలుగు ఐదు కొట్టించుకుని డబ్బులు సంపాధించాలని శ్రీమంతం శీను ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.