Jayam serial: ప్రాణాపాయ స్థితిలో గంగ.. మినిస్టర్ మాటలతో రుద్ర ఎమోషనల్!
on Dec 21, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-147 లో.. రుద్ర చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్ కి గెస్ట్ గా మినిస్టర్ వస్తాడు. ఫుడ్ టేస్ట్ చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడే గంగ వచ్చి అందులో విషం ఉందని చెప్తుంది. ఎవరే నువ్వు అని పారు ముసుగు తీస్తుంది. గంగని చూసి అందరు షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ అని రుద్ర అడుగుతాడు. ఇలా వేషం మార్చుకొని మాయ చెయ్యడం నీకు అలవాటే కదా అని శకుంతల కోప్పడుతుంది.
ఆ తర్వాత ఇందులో విషం ఉందని గంగ అంటుంటే నీకెలా తెలుసు అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఒక రౌడీ ఫోన్ మాట్లాడుతుంటే విన్నానని గంగ చెప్తుంది. ఆపు ఇక అని రుద్ర కోప్పడతాడు. మీరు నమ్మాలంటే ఏం చెయ్యాలని ఆ విషం ఉన్న ఫుడ్ ని గంగ తీసుకుంటుంది. కాసేపటికి కింద పడిపోతుంది వెంటనే గంగని రుద్ర హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు.
మరొకవైపు ఇషిక, పారు, వీరు డిజప్పాయింట్ అవుతారు. గంగని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళాక తనకి ఏం కాకూడదని డాక్టర్ కి చెప్తాడు రుద్ర. గంగని ఆ సిచువేషన్ లో చూసి రుద్ర రిగ్రెట్ ఫీల్ అవుతాడు. గంగ మాటలు నమ్మాల్సింది, తప్పు చేశానని రుద్ర బాధపడతాడు. మరొకవైపు ఫుడ్ ఫెస్టివల్ లో ఫుడ్ లో పాయిజన్ గురించి మీడియా వాళ్ళు శకుంతలని అడుగుతారు. ఈ విషయం వదిలేయండి అని వీరు కవర్ చేస్తాడు.
ఆ తర్వాత గంగ బానే ఉంది కానీ విషం బాడీ లో స్ప్రెడ్ అయింది. తను మినీ కోమాలో ఉందని డాక్టర్ చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. గంగని చూసి రుద్ర బాధపడుతుంటే.. అప్పుడే మినిస్టర్ సూర్య ప్రతాప్ వస్తాడు. మీ పెద్దనాన్న అంతా చెప్పాడు. గంగ నీ భార్య అవ్వడం నీ అదృష్టం.. నమ్మకం కలిగించడానికి తన ప్రాణం పణంగా పెట్టింది. అలాంటి వాళ్ళని మిస్ చేసుకోవద్దు.. నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు కలిసి ఉండాలని, అతను చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



