'కాటమరాయుడు' తర్వాత శ్రుతి రెండేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకుందంటే...
on Sep 13, 2021
ముక్కుసూటిగా మాట్లాడే శ్రుతీ హాసన్ ఈ మధ్య వార్తల్లో బాగా కనిపిస్తోంది. ఆమధ్య లాక్డౌన్ కారణంగా లభించిన టైమ్తో తన బాయ్ ఫ్రెండ్ శంతను హాజారికాతోతో తెగ ఎంజాయ్ చేస్తోంది.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా మారింది శ్రుతి. తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ, ఫాలోవర్స్తో తెగ ముచ్చటిస్తోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తనలో మార్పు కోసం ఓ నిర్ణయం తీసుకుందట.
కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రుతి రిఎంట్రీతో పలు అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది. ఇంతకు ముందు కెరీర్ బాగా జోరుగా ఉందనుకున్న సమయంలో ఇంగ్లాండ్ సింగర్ మైఖేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలోపడి సినిమాలకు కొంత కాలం దూరమైంది. అతడితో బ్రేకప్ తర్వాత మళ్లీ బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె డూడిల్ ఆర్టిస్ట్ హజారికాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల తన సోషల్ మీడియా వేదిక ద్వారా కాసేపు ఫాలోవర్స్తో ముచ్చటించినప్పుడు, ఒకతను 'కాటమరాయుడు' సినిమా తర్వాత రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించాడు. దానికి శ్రుతి ఆ విరామం అనేది తనకు తానే తీసుకున్నదని చెప్పింది. అంతేకాకుండా దాని వల్ల తనను తాను మార్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నదట. అంతేకానీ వర్క్ మీద ఆసక్తి లేకపోవడం దీనికి కారణం కాదని తెలిపింది. ఆమెకు గతంలో సంగీతంపై దృష్టి పెట్టడానికి ఆసక్తి ఉండేది కాదట. కానీ సంగీతం ఇష్టమని.. ఇప్పుడు సంగీతం, నటనను సమానంగా చూస్తున్నానని తెలిపింది.
లాక్ డౌన్ పీరియడ్లోనే 'పిట్ట కథలు' ఆంథాలజీలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 'ఎక్స్ లైఫ్'లో నటించిన శ్రుతి, పవన్ కల్యాణ్ భార్యగా 'వకీల్ సాబ్'లో కనిపించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. లేటెస్ట్గా విజయ్ సేతుపతి జోడీగా 'లాభం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్'లో నటిస్తోంది.
Also Read