పవర్ స్టార్ కొత్త సినిమాకి ముహూర్తం ఖరారు!
on Feb 8, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను ప్రకటిస్తూ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' చేస్తున్నాడు. ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రాలను ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలు లాంచ్ కూడా అయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమా లాంచ్ కి సిద్ధమవుతోంది.
తమిళ చిత్రం 'వినోదయ సిత్తం' తెలుగు రీమేక్ లో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ నటించనున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 14న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుందని సమాచారం.
'వినోదయ సిత్తం' రీమేక్, 'ఓజీ' సినిమాల షూటింగ్ కోసం తక్కువ రోజులే కేటాయించాల్సి ఉండటంతో.. ముందుగా ఈ రెండు చిత్రాలను పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారట. ఈ రెండు చిత్రాల షూటింగ్ సమాంతరంగా జరగనుందని తెలుస్తోంది.
Also Read