దేవగణ్ను డైరెక్ట్చేయనున్న రాజమౌళి ఫాదర్..?
on Jul 11, 2016
టాలీవుడ్ స్టార్ రైటర్..దర్శకధీరుడు రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ ఏ ముహూర్తాన భజరంగీ భాయ్జాన్ చిత్రానికి కథను అందించారో కానీ ఆ సినిమా సక్సెస్తో బాలీవుడ్లో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. దీంతో బిటౌన్ బాబులంతా కథ కావాలంటూ విజయేంద్రప్రసాద్ వెంట పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక సినిమాకు కథ అందించేందుకు ఓకే చెప్పారు. శంకర్ దర్శకత్వం వహించిన సూపర్హిట్ మూవీ ఒకే ఒక్కడు హిందీ రీమేక్ నాయక్ సీక్వెల్కు కథ అందిస్తున్నారాయన. అలాగే అజయ్ దేవగణ్ కోసం ఓ కథ రాస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. 1992లో వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని కథగా ఎంచుకున్నట్టు ప్రచారం జరగుతోంది. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహ్లాని సినిమాను నిర్మించనున్నారు.