బాహుబలికి సంవత్సరం నిండింది..
on Jul 10, 2016
తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటిన బాహుబలి బిగినింగ్ రిలీజై ఇవాళ్టీకి ఏడాది..ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులతో జక్కన్న చెక్కిన శిల్పం బాహుబలి. గత సంవత్సరం సరిగ్గా ఇదే రోజున..జులై10న విడుదలైంది. తెలుగు సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపించగలదని నిరూపించాడు దర్శకధీరుడు రాజమౌళి.
అప్పటి వరకు సినిమా థియేటర్ మొహం కూడా చూడని ప్రేక్షకుల్ని బాహుబలి థియేటర్ వైపు నడిపించాడు. ఒకరకంగా 2015ను బాహుబలి నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఫిలింఫేర్, కేన్స్ ఇలా ఏ అవార్డ్ ఫంక్షన్లో అయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాహుబలే..ప్రపంచవ్యాప్తంగా ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాహుబలిని భారత ప్రభుత్వం కూడా సత్కరించింది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసింది.. దీంతో తెలుగు సినిమాకు జాతీయ అవార్డు లేదన్న కొరత తీరిపోయింది. కాగా బాహుబలి-2ను మొదటి భాగం కన్నా భారీ బడ్జెట్తో..ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.