హారర్ డ్రామా సీక్వెల్లో.. అతిథిగా విజయ్ సేతుపతి
on Feb 26, 2021
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే.. మరోవైపు ప్రతినాయకుడి పాత్రల్లోనూ అలరిస్తున్నారు. ఇంకోవైపు అతిథి వేషాల్లోనూ మెరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఓ హారర్ డ్రామాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సేతుపతి.
ఆ వివరాల్లోకి వెళితే.. 2014లో తమిళనాట సర్ ప్రైజ్ హిట్ గా నిలిచిన చిత్రం `పిచాసు`. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ డ్రామా.. తెలుగులో `పిశాచి` పేరుతో అనువాదమై ఇక్కడా ఆదరణ పొందింది. కట్ చేస్తే.. ఇప్పుడీ సక్సెస్ ఫుల్ వెంచర్ కి సీక్వెల్ గా `పిచాసు 2`ని రూపొందిస్తున్నారు మిస్కిన్.
ఆండ్రియా, పూర్ణ, రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారు. కేవలం 3, 4 రోజుల్లోనే తన క్యారెక్టర్ కి సంబంధించి షూటింగ్ పూర్తవుతుందని టాక్. త్వరలోనే `పిచాసు 2` షూటింగ్ లో విజయ్ జాయిన్ కానున్నారు.
మరి.. ఈ హారర్ డ్రామా సీక్వెల్ కి విజయ్ సేతుపతి ఫ్యాక్టర్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.