ENGLISH | TELUGU  

దిల్ రాజు నిర్మాణంలో విజయ్-పరశురామ్ మూవీ.. 'గీత గోవిందం-2' ఏమైంది?

on Feb 6, 2023

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో జీఏ2 పిక్చర్స్ నిర్మాణంలో 'గీత గోవిందం' సీక్వెల్ వచ్చే అవకాశముందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా విజయ్, పరశురామ్ కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో ఓ కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

'సర్కారు వారి పాట' తర్వాత నాగ చైతన్యతో చేయాల్సిన పరశురామ్ ప్రాజెక్ట్ అటకెక్కింది. నందమూరి బాలకృష్ణతో సినిమా ఉంటుందని అన్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి విజయ్-పరశురామ్ చేతులు కలపబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పటికే విజయ్ చేతిలో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి', గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD 12' చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బ్లాక్ బస్టర్ కాంబో విజయ్-పరశురామ్ తో సినిమా చేస్తున్నట్లు దిల్ రాజు కి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

విజయ్-పరశురామ్ రెండో ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటికీ వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదని.. 'ఖుషి', 'VD 12' పూర్తయ్యాక మొదలవుతుందని అంటున్నారు. ఈ గ్యాప్ లో పరశురామ్ మరో ప్రాజెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదని టాక్. ప్రస్తుతం ఆయన ఓ తమిళ్ హీరోతో టచ్ లో ఉన్నారని సమాచారం. మరోవైపు భవిష్యత్ లో 'గీత గోవిందం-2' చేసే సన్నాహాల్లో జీఏ2 పిక్చర్స్ ఉందని తెలుస్తోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.