దిల్ రాజు నిర్మాణంలో విజయ్-పరశురామ్ మూవీ.. 'గీత గోవిందం-2' ఏమైంది?
on Feb 6, 2023
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో జీఏ2 పిక్చర్స్ నిర్మాణంలో 'గీత గోవిందం' సీక్వెల్ వచ్చే అవకాశముందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా విజయ్, పరశురామ్ కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో ఓ కొత్త సినిమా ప్రకటన వచ్చింది.
'సర్కారు వారి పాట' తర్వాత నాగ చైతన్యతో చేయాల్సిన పరశురామ్ ప్రాజెక్ట్ అటకెక్కింది. నందమూరి బాలకృష్ణతో సినిమా ఉంటుందని అన్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి విజయ్-పరశురామ్ చేతులు కలపబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పటికే విజయ్ చేతిలో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి', గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD 12' చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బ్లాక్ బస్టర్ కాంబో విజయ్-పరశురామ్ తో సినిమా చేస్తున్నట్లు దిల్ రాజు కి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
విజయ్-పరశురామ్ రెండో ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటికీ వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదని.. 'ఖుషి', 'VD 12' పూర్తయ్యాక మొదలవుతుందని అంటున్నారు. ఈ గ్యాప్ లో పరశురామ్ మరో ప్రాజెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదని టాక్. ప్రస్తుతం ఆయన ఓ తమిళ్ హీరోతో టచ్ లో ఉన్నారని సమాచారం. మరోవైపు భవిష్యత్ లో 'గీత గోవిందం-2' చేసే సన్నాహాల్లో జీఏ2 పిక్చర్స్ ఉందని తెలుస్తోంది.