హీరోయిన్గా ఏఆర్ రెహమాన్ మేనకోడలు
on Jul 8, 2020

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనకోడలు, యువ సంగీత దర్శకుడు & తమిళ హీరో జీవీ ప్రకాష్ కుమార్ సిస్టర్ భవానీ శ్రీ హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, ఆమె సినిమా చేయలేదు. వెబ్ యాంథాలజీలో ఒక కథలో నటించారు. అసలు వివరాలలోకి వెళితే...

పరువు హత్యల నేపథ్యంలో తమిళ దర్శకుడు వెట్రి మారన్, గౌతమ్ వాసుదేవ మీనన్, సుధా కొంగర, విఘ్నేష్ శివన్ ఒక వెబ్ యాంథాలజీ తీస్తున్నారు. నాలుగు కథల సంకలనంగా ఇది ఉంటుంది అన్నమాట. ఒక్కో కథ ఓ ఎపిసోడ్గా తీస్తారు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న కథలో రెహమాన్ మేనకొడలు భవానీ శ్రీ హీరోయిన్. ఆమెకు జోడీగా కాళిదాస్ జయరామ్ కనిపిస్తాడు. కొడైకెనాల్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందట.
వెట్రి మారన్ కథలో ప్రకాష్ రాజ్, సాయి పల్లవి నటించారు. వాళ్లిద్దరూ తండ్రీకూతుళ్లుగా నటించారని టాక్. విఘ్నేష్ శివన్ కథలో అంజలి, కల్కి కొచ్చిన్ నటించారు. ఇటీవల తన పాత్రకు ఇంటి నుండి అంజలి డబ్బింగ్ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



