'డీజే టిల్లు' సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Jun 5, 2023
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'డీజే టిల్లు' సినిమా గతేడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. 'టిల్లు స్క్వేర్' పేరుతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
'టిల్లు స్క్వేర్' సినిమాని 2023, సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించిన చిత్ర బృందం, సిద్ధు-అనుపమ ల రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్ ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. 'డీజే టిల్లు' చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించడంతో, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'టిల్లు స్క్వేర్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
