ఓటేసిన తలైవర్..
on May 16, 2016
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని స్టెల్లామేరి కాలేజీలో ఉన్న పోలింగ్ కేంద్రానికి సంప్రదాయ పంచెకట్టులో వచ్చిన రజనీకాంత్ నేరుగా లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న సిబ్బంది ఆయన వద్ద సంతకం తీసుకుని వేలికి ఇంకు గుర్తు వేయించుకుని తన ఓటును వేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉదయమే తన ఓటు ఉన్న పోలింగ్ కేంద్రానికి వచ్చే రజనీకాంత్..జనం తక్కువగా ఉన్నపుడే ఓటు వేసి వెళతారు. ఈ సారి కూడా ఆయన జనం రద్దీ మొదలుకాక ముందే తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన రజనీని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.
Also Read