మొదట్లో లోకేష్ను ఎవరూ పట్టించుకోలేదట!
on Jan 31, 2023
గత నాలుగైదేళ్లుగా హీరోగా సరైన హిట్ లేదు. నిర్మాతగా కూడా చేదు అనుభవాలు. భారీ నష్టాలు చవిచూశారు. ఆయన ఎవరో కాదు. దేశం గర్వించదగ్గ విశ్వనటుడు కమల్ హాసన్. అలాంటి కమలహాసన్ కు నాలుగేళ్ల తర్వాత సాలిడ్ ఇండస్ట్రీ హిట్ను అందించిన చిత్రం విక్రమ్. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్. నేడు దేశంలోని దిగ్గజ దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారి సరసన అతి తక్కువ చిత్రాలతోనే వారికి సమాన మైన క్రేజ్, ఇమేజ్ తెచ్చుకున్నారు. వారి సరసన మూడు నాలుగు చిత్రాలతోనే అది తక్కువ సమయంలో ఆ స్థాయిలో ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీతో లోకేష్ కనకరాజు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్ హాట్ ఫేవరెట్ డైరెక్టర్గా ఈయనను అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే విక్రమ్ విజయం తర్వాత చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు విక్రమ్ ని పిలిచి ప్రత్యేకంగా ఆహ్వానించి డిన్నర్ కూడా ఇచ్చారని సమాచారం.
ఇక తమ సినిమాలో విక్రమ్ తరహ బ్యాగ్రౌండ్ స్కోరు ఉండాలని డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ లో చాలామంది ఉన్నారని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోలు సైతం మ్యూజిక్ డైరెక్టర్ తో అనడం హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ కనకరాజు తో సినిమా చేయాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అందరూ లోకేష్ కనకరాజును కోరుకుంటున్నారు. తెలుగు స్టార్ హీరోలను ఆయన మెప్పించారు. కొందరు నిర్మాతలు తనతో సినిమా అంటే విక్రమ్ కి ముందు పెద్దగా పట్టించుకోలేదట. ఈ విషయాన్ని యంగ్ హీరో సందీప్ కిషన్ వెల్లడించాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ మా నగరం మూవీని చేశాడు. ఇదే మూవీని తెలుగులోను విడుదల చేశాడు. రెండు భాషల్లోనూ ఈ మూవీ మంచి హిట్ అనిపించింది. అదే సమయంలో లోకేష్ కనకరాజ్ టాలెంట్ గురించి తెలిసి టాలీవుడ్లో ఆరుగురు ప్రొడ్యూసర్ల వద్దకు సందీప్ కిషన్ తీసుకెళ్లాడట. సందీప్ తీసుకెళ్లిన ప్రతి నిర్మాత లోకేష్ ను పట్టించుకోలేదట. ఈ స్థాయి డైరెక్టర్ అవుతాడని వారు పెద్దగా ఆసక్తి చూపించలేదట.
ఆరుగురికి ఆరుగురు నిర్మాతలు లోకేష్ కనకరాజును రిజెక్ట్ చేయడంతో తను తమిళ్లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఖైదీ తో ట్రాక్ లోకి వచ్చి విజయ్తో మాస్టర్, కమల్ తో విక్రమ్ సినిమాలు చేయడం ద్వారా తన పేరు టాలీవుడ్ లోనూ మారుమోగుతోంది. ఇలా యంగ్ టాలెంట్ను నిరాశపరిచిన ఆ ఆరుగురు నిర్మాతలు ఎవరనే దానిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సందీప్ కిషన్ మైకేల్ మూవీ చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
