వరుణ్ తేజ్ ను మిస్టర్ అంటున్న వైట్ల..!
on Apr 19, 2016
శ్రీను వైట్ల, వరుణ్ తేజ్ సినిమా ఏప్రిల్ 8 న ఉగాది సందర్భంగా మొదలుకావాల్సి ఉంది. ఉగాది వెళ్లిపోయింది. శ్రీరామనవమి కూడా దాటేసింది. కానీ ఇప్పటి వరకూ వరుణ్ సినిమా గురించిన అనౌన్స్ మెంట్ మాత్రం లేదు. దీంతో వరుణ్ కు కథ నచ్చలేదని, శ్రీను వైట్ల డిలే చేస్తున్నాడని ఏవేవో పుకార్లు వినిపించాయి. కానీ మూవీ టీం వాటన్నింటినీ కొట్టి పారేస్తున్నారు. మే 15 నుంచి మూవీ రెగులర్ షూట్ స్పెయిన్ లో మొదలవుతుందని, సినిమాకు మిస్టర్ అనే టైటిల్ ను అనుకుంటున్నామని, యూనిట్ చెబుతున్నారు. వరుణ్ కు జోడీగా లావణ్య త్రిపాఠీ, హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతోనే మూవీ షూట్ లేటయ్యిందట. శ్రీను కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం. అందుకే కాస్త లేటైనా, సినిమా కథపై ఎక్కువ కూర్చున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలనేది శ్రీను వైట్ల ఆలోచన. సో, మూవీ షూట్ కు వెళ్లే డేట్ ను ప్రకటించిన టెంపరరీగా అన్ని పుకార్లకూ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మూవీ టీం.