లైఫ్,లవ్ యువర్ ఫాదర్..మొత్తం కాశీలోనే
on Mar 17, 2025
లెజెండరీ సింగర్ అమరజీవి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం(Sp balasubramanyam)తనయుడు సింగర్ ఎస్ పి చరణ్(Sp Charan)చాలా ఏళ్ళ తర్వాత 'లైఫ్' లవ్ యువర్ ఫాదర్(Life LOve Your Father)అనే సినిమాతో తెలుగు చిత్ర సీమలో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.ఆయన ప్రధాన పాత్రలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆదిదేవుడి నివాసం,హిందువుల పుణ్యక్షేత్రం కాశీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా,మనీషా ఆర్ట్స్ అధినేతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీలు అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ అధినేత రామస్వామి రెడ్డి తో కలిసి నిర్మిస్తున్నారు.మనీషా ఆర్ట్స్(Maneesha Arts)గతంలో ఎస్ వి కృష్ణారెడ్డి(Sv krishnareddy)తో పలు హిట్ చిత్రాలని నిర్మించిన విషయం తెలిసిందే. పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా పవన్ కేతరాజు(Pawan Ketharaju)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది.ఈ సందర్భంగా మూవీ టీం పలు విషయాలపై మీడియాతో ముచ్చటించింది.
దర్శకుడు పవన్ మాట్లాడుతు కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం కథే ఈ సినిమా.కథ మొత్తం కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుండగా మూవీలో శివతత్వాన్ని కూడా చూపించాం.హీరో తండ్రి పాత్రలో ఎస్ పి చరణ్ గారు మా మూవీకి చాలా ప్లస్ అయ్యారు.విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మెలోడీ బ్రహ్మమణిశర్మ(Mani Sharma)గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.
నిర్మాత అన్నపరెడ్డి రామస్వామిరెడ్డి మాట్లాడుతు మూవీ చాలా బాగా వచ్చింది.ఎక్కువ భాగం కాశీలోనే షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపించబోతున్నాం.ఫస్ట్ కాపీ చూశాక ఆర్ ఆర్ చాలా అద్భుతంగా అనిపించింది.సినిమాపై మా నమ్మకం ఇంకా పెరిగింది.వెంటనే మణిశర్మ గారిని సత్కరించడానికి వెళ్ళాం.ఆర్ ఆర్ బాగా కుదిరినందుకు ఆయన కూడా చాలా సంతోషించారు. ఏప్రిల్ 4న మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం.ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నామని తెలిపారు.నాగమాధురి డైలాగ్స్ అందించగా, డీవోపిగా శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ గా రామకృష్ణ,ఆర్ట్ డైరెక్టర్ గా చిడిపల్లి శంకర్, కొరియోగ్రాఫర్ గా మొయిన్, ఫైట్ మాస్టర్ గా కార్తీక్, పిఆర్ఓగా మధు వీఆర్ వ్యవహారించారు.రఘుబాబు,నవాబ్ షా,ప్రవీణ్, భద్రం,షకలక శంకర్, రియా వంటి వారు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
