అజయ్ దేవగణ్, శ్రియ.. ముచ్చటగా మూడోసారి!
on Feb 23, 2021
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ `దృశ్యం`లో ఇద్దరు బిడ్డల తల్లిగా దర్శనమిచ్చింది ఉత్తరాది భామ శ్రియ. కట్ చేస్తే.. ఆరేళ్ళ తరువాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`లో మరోసారి అతనికి జంటగా నటిస్తోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తుండగా.. కీలక పాత్రని అజయ్ దేవగణ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ ఫ్లాష్ బ్యాక్ లో శ్రియ మెరుస్తుంది.
ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్` విడుదలయ్యేలోపే అజయ్ దేవగణ్ తో మరో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కిందట శ్రియకి. ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన `దృశ్యం2` ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సీక్వెల్ ని తెలుగుతో పాటు హిందీలోనూ జీతూ జోసెఫ్ నే రీమేక్ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో.. `దృశ్యం` హిందీ వెర్షన్ లో అజయ్ కి జంటగా నటించిన శ్రియనే.. సీక్వెల్ లోనూ కొనసాగబోతుందంటూ కథనాలు వస్తున్నాయి. మరి.. ముచ్చటగా మూడోసారి అజయ్, శ్రియ జోడీ కడుతున్నారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.