వర్మ పూరీకి షాకిచ్చాడా...?
on Nov 8, 2013
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "బిజినెస్ మెన్" చిత్రం తెలుగులో మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ.
అయితే తాజాగా వర్మ "సత్య-2" అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఈరోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం "సత్య" సినిమాకు సీక్వెల్ కాదని వర్మ చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నాడు. కానీ జనాలు మాత్రం "సత్య" సినిమాకు సీక్వెల్ అని అనుకునే "సత్య-2"కి వెళ్తారు. కానీ అలా వెళ్ళిన వారికీ "సత్య" సినిమా సీక్వెల్ కి బదులుగా..."బిజినెస్ మెన్" సినిమా సీక్వెల్ ని చూసినట్లుగా అనిపిస్తుందట. ఈ సినిమా విజయం గురించి మరికొద్ది రోజులు ఎదురుచూస్తే తప్ప తెలియదు.