పండగపూట.. `సర్కారు వారి` మొదటి `పాట`!
on Sep 25, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కలిసొచ్చిన సంగీత దర్శకుల్లో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒకరు. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి రెండు చిత్రాలు `దూకుడు`, `బిజినెస్ మేన్` అటు మ్యూజికల్ గానూ, ఇటు కమర్షియల్ గానూ మెప్పించాయి. ఇక మూడో సినిమాగా వచ్చిన `ఆగడు` మ్యూజికల్ గా ఓకే అనిపించుకున్నా.. బాక్సాఫీస్ ముంగిట అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరు జట్టుకట్టిన `సర్కారు వారి పాట` తాలుకూ ఆల్బమ్ పై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట`కి సంబంధించిన మొదటి పాటని రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్సయిందట. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 15న `సర్కారు వారి పాట` ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయబోతున్నారని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `సర్కారు వారి పాట`కి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ నాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న `సర్కారు వారి పాట` థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read