రామ్ చరణ్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ మూవీ!
on Apr 19, 2023

యాక్సిడెంట్ కారణంగా కొంతకాలం కెమెరాకు దూరంగా ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష' ఈ శుక్రవారం(ఏప్రిల్ 21) ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తన మేనమామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి 'వినోదయ సిత్తం' రీమేక్ లో నటిస్తున్నాడు. దీనితో పాటు తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
'ఏమైంది ఈ వేళ'తో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్ట్ ని చేసే ఛాన్స్ దక్కించుకున్న సంపత్.. 'రచ్చ'తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత 'బెంగాల్ టైగర్', 'గౌతమ్ నంద', 'సీటీమార్' సినిమాలతో పరవాలేదు అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు సాయి తేజ్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. సాయి తేజ్, సంపత్ నంది కలయికలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, జూన్ లేదా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



