సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం
on Dec 2, 2022
బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన 15వ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన 16వ సినిమాని కూడా అదే బ్యానర్ లో చేస్తుండటం విశేషం. తాజాగా ఈ మూవీ ప్రారంభమైంది.
సాయి తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. బాపినీడు సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో జయంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే సాయి తేజ్ వరుసగా ఎస్వీసీసీ బ్యానర్ లో సినిమాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
