ENGLISH | TELUGU  

రాజశేఖర్‌తో 'యముడికి మొగుడు' భామ?

on Sep 28, 2020

 

త్వరలో కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెడీ అవుతున్నారు. నీలకంఠ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మంచి విజయం సాధించిన 'జోసెఫ్'కి ఈ సినిమా రీమేక్. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్‌ని సెలెక్ట్ చేశారట.

అల్లరి నరేష్ సరసన కథానాయికగా 'యముడికి మొగుడు'లో యమధర్మరాజు కుమార్తెగా నటించిన రిచా పనయ్ గుర్తుందా? తరవాత సునీల్ 'ఈడు గోల్డ్ ఎహే'లోనూ నటించింది. నీలకంఠ సినిమాలో రాజశేఖర్ సరసన ఆ అమ్మాయి నటించనున్నదని సమాచారం. మాజీ భార్య మరణం తరవాత క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మలయాళ కథలో మార్పులు, చేర్పులు చేశారట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.