వైరల్ అవుతున్న రేణూ దేశాయ్ పోస్ట్.. పవన్కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.!
on Apr 15, 2024
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంలో బిజీ అయిపోయారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అందరి దృష్టీ ఆంధ్రప్రదేశ్పైనే ఉంది. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే క్యూరియాటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తమ అభ్యర్థుల విజయం కోసం ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. మరో పక్క జగన్ తనదైన శైలిలో యాత్రలు చేస్తూ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో, కామెంట్ అందర్నీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పోస్ట్పై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ ద్వారా తాను కూటమికి మద్దతు ఇస్తున్నట్టు అర్థమవుతోంది. బీజేపీ సింబల్ అయిన కమలం గుర్తుతోపాటు మౌనం పరం శీలం అంటూ ఓ టాటూని చేతిపై వేయించుకుంది. అంతేకాదు, మాటల కంటే ఫోటోలే ఎక్కువగా మాట్లాడతాయి అనే కామెంట్ కూడా చేసింది. దీంతో రేణు కూటమికే మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి ఆమె డైరెక్ట్గా చెప్పకపోయినా ఆమె చేసిన పోస్ట్ ఉద్దేశం మాత్రం అదేనని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం రేణు దేశాయ్ నటనకు పూర్తిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పిల్లలను చూసుకోవడంలో ఆమె బీజీ అయిపోయింది. అకీరా సినిమా ఎంట్రీ గురించి గతంలో చాలా ప్రచారాలు జరిగాయి. అయితే అలాంటిది ఏమైనా ఉంటే తానే అప్డేట్ చేస్తానని రేణు స్వయంగా ప్రకటించింది. వాటన్నింటినీ మించి ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ డిస్కషన్ పాయింట్గా మారింది. అందరూ ఈ పోస్ట్ గురించి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.