ఆ నిర్మాతతో మరోసారి రవితేజ
on Jan 18, 2021
క్రాక్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి చేస్తున్నారు. ఇందులో రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారాయన. వేసవిలో ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్స్ లో సందడి చేయనుంది. అలాగే క్రాక్ సీక్వెల్ లోనూ నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్.
ఇదిలా ఉంటే.. తనతో నేల టికెట్, డిస్కో రాజా వంటి చిత్రాలను నిర్మించిన ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి కాంబినేషన్ లో మరో సినిమా చేయబోతున్నారట రవితేజ. నేల టికెట్, డిస్కో రాజా ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. సదరు నిర్మాతతో భవిష్యత్ లో ఇంకో చిత్రం చేద్దామని గతంలో మాటిచ్చారట మాస్ మహారాజా. ఆ మాటకు కట్టుబడే.. ఈ ప్రాజెక్ట్ ని చేయబోతున్నారట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రామ్ తాళ్ళూరి ఓ మూవీ ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కనుంది.