చెర్రీకి సుకుమార్ ఏ కథ చెప్పాడు..?
on Feb 10, 2016

కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు రామ్ చరణ్. తను నమ్మి చేసిన కొన్న స్క్రిప్టులు దెబ్బ కొట్టడంతో, ఈ జాగ్రత్త ఇంకా పెరిగింది. అలాంటి చెర్రీకి, కథ చెప్పి సుకుమార్ ఓకే చేయించుకున్నాడని సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తని ఒరువన్ రీమేక్ తో బిజీగా ఉన్న చెర్రీ, దాని తర్వాత సుక్కుతో సినిమాను పట్టలెక్కించబోతున్నాడట.
సుక్కు రీసెంట్ కథల్ని చూస్తే, అన్నీ థ్రిల్లర్ జానర్ లో జరిగేవే కనిపిస్తాయి. సుక్కుభాయ్ కు వీటి మీద ఎందుకు ఇంట్రస్ట్ పెరిగిందో తెలియదు గానీ, హండ్రడ్ పర్సంట్ లవ్ తర్వాత నుంచీ పూర్తిగా థ్రిల్లర్ జానర్ లోనే మునిగి తేలుతున్నాడు. నేనొక్కడినే, కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో..ఇలా వరసగా మూడింటినీ ఒకే జానర్ లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అలాగని లవ్ ను వదిలేయలేదు. థ్రిల్లర్ కు కొద్దిగా రొమాంటిక్ టచ్ కూడా ఇస్తున్నాడు. చెర్రీ ఇప్పటికే ఎవడుతో థ్రిల్లర్ టైప్ ప్రయోగం చేశాడు. మరి సుక్కూ భాయ్ థ్రిల్లర్ కథ చెప్పే చరణ్ ను ఒప్పించాడా..లేక ఆర్య, ఆర్య-2 లా విభిన్న ప్రేమకథను చెప్పాడా.. తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



