రఫ్ఫాడేస్తున్న రకుల్
on Apr 22, 2015

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమాతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీ లో యంగ్ హీరోల హాట్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రకుల్ రవితేజ కిక్-2 లో నటిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఒకేసారి ముగ్గురు టాప్ హీరోల సరసన జోడీకట్టే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్, మహేశ్ బాబు ఈ ముగ్గురు హీరోలు రకుల్ కు తమ సరసన నటించే అవకాశం ఇచ్చారు. రామ్ చరణ్ - శ్రీనువైట్ల, ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్లలో రకుల్ నటిస్తోంది. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేక మహేశ్ బాబు సినిమా 'బ్రహ్మోత్సవం' లో నటించే ఛాన్స్ మిస్సయ్యిందని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. తన స్ఠానంలో సమంత నటించే అవకాశం ఉందనే పుకార్లు జోరుగా వినిపించాయి. దీంతో అలర్ట్ అయిన రకుల్ బ్రహోత్సవంలో హీరోయిన్ ఛాన్స్ తనదేనని ఎట్టి పరిస్థితిలో ఛాన్స్ మిస్ చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. మరి రకుల్ రాపిడ్ స్పీడ్ చూస్తుంటే నంబర్ వన్ ప్లేస్ కు తొందరగానే చేరుకునేట్టు ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



