జెండా ఎత్తేసిన హీరోయిన్ ఎవరు??
on Apr 22, 2015
ఎర్రచందనం స్మగ్లర్ల కేసు తీగ లాగితే డొంక కదులుతోంది. ఎర్రచందనం స్మగ్లర్లకీ.. ఓ టాలీవుడ్ నిర్మాతకూ సంబంధం ఉందని తాజాగా ఎంక్వైరీలో తేలింది. స్మగ్లర్లు సినిమా పరిశ్రమలో పెట్టుబడి పెట్టారని.. ఓ హీరోయిన్కి భారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని పోలీసులు నిర్దారించారు. ఆ హీరోయిన్ పంజాబీ పడుచట. ప్రతి నెలా ఆ హీరోయిన్ ఖాతాలో భారీగా డబ్బులు జమవుతూ వచ్చాయట. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు ఆమె బ్యాంకు ఖాతాలను స్థంభింపచేశారు. అదుపులో తీసుకొని ప్రశ్నించాలనుకొంటున్న సమయంలోనే ఆ హీరోయిన్ బిజానా ఎత్తేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయిందని టాక్. మరి ఆ హీరోయిన్ ఎవరు?? అనే విషయంపై పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అగ్ర హీరోలతో జట్టు కట్టి... ఇప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న పంజాబీ భామే.. ఆ హీరోయిన్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజానిజాలేమిటో కాలమే చెప్పాలి.