ENGLISH | TELUGU  

ఎన్సీబీ విచార‌ణ త‌ర్వాత తొలిసారి ఇన్‌స్టాలో ర‌కుల్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌!

on Oct 15, 2020

 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తరువాత, నెపోటిజం, డ్రగ్స్ వంటి అనేక షాకింగ్ కేసులను చిత్ర పరిశ్రమ చూసింది. డ్రగ్‌ కేసులో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ చాలా పెద్ద పేర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ కేసులో సుశాంత్ సింగ్ ప్రేయసి, ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తితో సహా చాలా మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం రియా చక్రవర్తి బెయిల్‌పై బయటకు వచ్చింది. రియాతో పాటు, దీపికా పడుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా డ్ర‌గ్ కేసులో బ‌య‌ట‌కు వచ్చాయి. వీరంద‌రినీ డ్రగ్స్ కనెక్షన్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రశ్నించింది.

ఈ నేప‌థ్యంలో లేటెస్ట్‌గా రకుల్ ప్రీత్ చేసిన‌ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్‌సిబి విచారణ తర్వాత తొలిసారిగా ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రకుల్ ప్రీత్. తన పోస్ట్ కారణంగా రకుల్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఆమె త‌న పిక్చ‌ర్‌ను ఒక‌దాన్ని షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె త‌న ముఖం చూపించ‌కుండా యోగా చేయడం కనిపిస్తోంది. ఆమె శరీరమంతా ముందుకు సాగడదాన్ని ఇందులో మ‌నం చూడొచ్చు.

ఈ ఫోటోను పంచుకుంటూ, రకుల్ ప్రీత్, "Move, stretch, strengthen and simply let go (క‌ద‌లండి, లాగండి, బలం పుంజుకోండి, ముందుకు సాగండి)" అని దానికి క్యాప్ష‌న్ పెట్టింది. దీనికి ఆమె హార్ట్ ఎమోజీని కూడా జోడించింది.

ఈ పోస్ట్ చూసిన ఫాలోయ‌ర్లు రకుల్ ప్రీత్‌ను ట్రోల్ చేస్తున్నారు. డ్ర‌గ్‌ కేసులో ఆమె ప్రమేయం గురించి ప్ర‌స్తావిస్తూ మ‌రీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో, చాలా మంది ఫాలోయ‌ర్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. ఒకత‌ను ర‌కుల్‌న్ స‌పోర్ట్ చేస్తూ, ఆమె పోస్ట్‌ను 'నిజమైన ప్రేరణ'గా అభివర్ణించాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.