వివాదాల్లో దర్శకులు..మొన్నపూరి..నేడు తేజ
on Apr 26, 2016
తెలుగు సిని దర్శకులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేశారంటూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపిన వివాదం ఇంకా మరిచిపోకముందే మరో దర్శకుడు తేజ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు. ఆర్.వి కృష్ణారావు అనే కలప వ్యాపారి తనకు దర్శకుడు తేజ నుంచి ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 7వ తేది రాత్రి కృష్ణారావు తన కారులో వెళ్తుండగా ఫిలింనగర్ సాయి ముక్తిథామం వద్ద విక్కి అనే వ్యక్తి కారు ఆపి వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నీపై దృష్టి పెట్టాయని సినిమా దర్శకుడు తేజ ఇంటి విషయాన్న సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. మళ్లీ ఈ నెల 13వ తేదీన తేజ ఇదే విషయంపై కృష్ణారావుకు ఫోన్ చేసి దూషించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కృష్ణారావు తనకు ఈ ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వీరిపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.