వ్యాక్సిన్లు ఇప్పిస్తానంటూ సురేష్ బాబుకు టోకరా
on Jun 22, 2021
సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ జనాలను మోసం చేస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సిన్ లు ఉన్నాయంటూ నమ్మించి లక్ష రూపాయలు దోచుకున్నాడు.
నాగార్జున రెడ్డి అనే వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్ బాబు ఆఫీస్కు ఫోన్ చేశాడు. తన భార్య బ్యాంకు అకౌంట్ కు రూ.లక్ష బదిలీ చేయాలని కోరాడు. అది నిజమని నమ్మిన మేనేజర్ అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్ ఫర్ చేశాడు. కానీ ఆ తర్వాత నిందితుడు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఇదంతా మోసం అని గ్రహించిన మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
కాగా, నాగార్జున రెడ్డిని ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రతినిధిని వ్యాక్సిన్ల పేరుతో మోసగించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.