సలార్ స్టోరీ ఇదే.. ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రశాంత్ నీల్!
on Nov 29, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సీజ్ఫైర్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? ఇది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా కాదా? కేజీఎఫ్ కథతో లింక్ ఉంటుందా లేదా? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా వాటన్నంటికీ సమాధానం దొరికింది.
సలార్ కథ ఎలా ఉండబోతుంది? 'కేజీఎఫ్' స్టోరీతో లింక్ ఉంటుందా? అనే విషయాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. "బద్ద శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథ సలార్. ఇందులో స్నేహం అనేది ప్రధాన భావోద్వేగం. ఈ ఇద్దరు స్నేహితుల ప్రయాణాన్ని రెండు భాగాలుగా చూపించబోతున్నాం. అలాగే కేజీఎఫ్, సలార్ రెండూ భిన్నమైన కథలు. ప్రేక్షకులు సలార్ నుండి మరొక కేజీఎఫ్ ని ఆశించకూడదు. సలార్ దాని స్వంత ప్రపంచం, దాని స్వంత భావోద్వేగాలు, పాత్రలు కలిగి ఉంటుంది." అని నీల్ చెప్పారు. ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే శత్రువులుగా మారిన స్నేహితులు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ అని అర్థమవుతోంది.
మొత్తానికి కేజీఎఫ్ కథతో సలార్ కి సంబంధం లేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న సినిమా అని సలార్ పై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరాశ కలిగించే విషయమని చెప్పవచ్చు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
