టెన్షన్తో ప్రభాస్కు నిద్ర పట్టట్లేదు!
on Aug 26, 2019
'బాహుబలి 2' అనే ఇంటర్నేషనల్ బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రెండేళ్లకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రభాస్. ఆయన హీరోగా నటించిన 'సాహో' ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్లో యమ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. తెలుగు మీడియాకు ఇంతవరకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా బాలీవుడ్ మీడియాతో చాలా ఎక్కువగానే ఇంటరాక్ట్ అవుతున్నాడు. 'బాహుబలి' రెండు సినిమాల్లో హిందీలో డబ్బింగ్ సినిమాలుగానే విడుదలయ్యాయి. 'సాహో' మాత్రం ఏక కాలంలో తెలుగుతో పాటు హిందీలోనూ నిర్మాణమైంది. అంటే ప్రభాస్ హిందీలో నటించిన తొలి సినిమా 'సాహో'. ఒక హిందీ టీవీ షోలో మాట్లాడిన ప్రభాస్ ఆ సినిమా రిలీజ్ ముందు ఒక రోజంతా పడుకొని నిద్రపోవాలనుకుంటున్నానని చెప్పాడు.
దీనిపై క్లారిటీ ఇవ్వమని ఆ షో హోస్ట్ అయిన కపిల్ శర్మ అడగగా, బాగా నిద్ర పోవాలని కొన్ని రోజుల నుంచీ ట్రై చేస్తున్నాననీ, టెన్షన్ వల్లా, స్ట్రెస్ వల్లా నిద్ర పోలేకపోతున్నాననీ ప్రభాస్ తెలిపాడు. 'బాహుబలి'ని మ్యాచ్ చెయ్యడం కోసం దానికి మించిన బడ్జెట్తో 'సాహో' రూపొందడం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొంది, విడుదలవుతుండటమే ప్రభాస్ టెన్షన్కు కారణమని తెలుస్తోంది.
సుజీత్ డైరెక్ట్ చేసిన 'సాహో' మూవీలో శ్రద్ధా కపూర్ నాయికగా నటించగా, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పండే, వెన్నెల కిశోర్, లాల్, మందిరా బేడి, ఎవ్లీన్ శర్మ వంటి తారలు కీలక పాత్రలు చేశారు.