మళ్ళీ వార్తల్లోకి ప్రభాస్-అనుష్క...
on Dec 28, 2018
'బాహుబలి' ప్రభాస్, 'దేవసేన' అనుష్క మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. 'బాహుబలి'ని హిందీలో విడుదల చేసిన నిర్మాత పిలిచాడు కదా అని మొన్నటికి మొన్న 'కాఫీ విత్ కరణ్' షోకి వెళితే... 'అనుష్కతో ఎఫైర్ సంగతి ఏంటి?' ప్రభాస్కి ప్రశ్నల వర్షం ఎదురైంది. ఎప్పటికప్పుడు అనుష్క తనకు స్నేహితురాలు మాత్రమేనని ప్రభాస్ చెబుతున్నా... ఈ ప్రశ్నలు ఆగడం లేదు. తాజాగా మళ్ళీ వీళ్ళిద్దరూ పెళ్లి వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే... దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లికి పింక్ సిటీ జైపూర్ ముస్తాబు అయ్యింది. తెలుగు స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని ఫ్యామిలీలు ఆదివారం పెళ్లి అయితే... రాజమౌళి ఫ్యామిలీతో కలిసి శుక్రవారం జైపూర్ వెళ్లారు. కాగా... కార్తికేయ పెళ్లికి ప్రభాస్ అనుష్క జంటగా వెళ్లారని ఎయిర్ పోర్ట్ ఫొటోలు, వీడియోలను బట్టి అర్థమవుతుంది. దాంతో వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని సోషల్ మీడియాలో అభిమానులు మాట్లాడుకుంటున్నారు.